- గ్యాలంట్రీ అవార్డు కింద నిధులు మంజూరు
హైదరాబాద్, వెలుగు: గాల్వాన్ లోయలో అమరుడైన కల్నల్ బికుమల్ల సంతోష్బాబు భార్య సంతోషికి మహావీర్ చక్ర గ్యాలంట్రీ అవార్డు కింద రూ. కోటి 25 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. భారత్–చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబుకు నిరుడు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే.