
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న 12,055 కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరి సేవలను 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు కొనసాగించనున్నారు. లేదంటే పీఆర్, ఆర్డీ శాఖలో కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాల్లో అవసరం ఉన్న వరకు సేవలను వినియోగించుకోనున్నారు.
ఇందులో 3,717 ఎఫ్టీలు, 7,385 కాంట్రాక్టు, 900 ఔట్ సోర్సింగ్, 53 గౌరవ వేతన ఉద్యోగులున్నారు. వేతనం, ఖర్చు సంబంధిత కేంద్ర పథకాల నిధుల నుంచి ఎస్ఎన్ఏ స్పర్శ మాడ్యూల్ ద్వారా చెల్లించనున్నది. ఒప్పందాలు నిర్దేశిత నిబంధనలకు లోబడి ఉంటాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.