కంటైన్మెంట్ జోన్ల‌తో పాటు రాష్ట్ర‌మంతా లాక్ డౌన్ పొడిగింపు

కంటైన్మెంట్ జోన్ల‌తో పాటు రాష్ట్ర‌మంతా లాక్ డౌన్ పొడిగింపు

జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలో లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్… సి.ఎస్ సోమేశ్ కుమార్, డీజీ‌పీ మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించారు. కంటైన్మంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ఏవైతే లాక్ డౌన్ నిబంధనలు ప్రస్తుతం అమలవుతున్నాయో అవి జూన్ 7 వరకు కొనసాగుతాయని చెప్పారు . కంటైన్మంట్ జోన్లలో మాత్రం కట్టుదిట్టంగా జూన్ 30 వ‌ర‌కు లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి పూట కర్ఫ్యూ కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు. షాపులను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచాలని కోరారు. ఇతర రాష్ట్రాల రాకపోకలు కూడా ఎలాంటి నియంత్రణ అవసరం లేదని చెప్పారు.