విశాఖ ఉక్కుపై ఉత్త మాటలె.. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనని తెలంగాణ

విశాఖ ఉక్కుపై ఉత్త మాటలె.. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనని తెలంగాణ
  • తమ బిడ్ కోసం టైమ్ ఇవ్వాలని ఇటీవల కేంద్రానికి వినతి
  • ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చిన కేంద్రం
  • సమయం ముగిసినా టెండర్లకు దూరంగానే సర్కారు
  • సింగరేణి భాగస్వామ్యంపై ఎదురు చూసిన కార్మికుల ఆశలపై నీళ్లు
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పేరుతో ఇంతకాలం రాజకీయాలు 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్లలో పాల్గొంటామ ని ఇన్నాళ్లు చెప్తూ వచ్చిన తెలంగాణ సర్కారు చివరి నిమిషం ఉసూరుమనిపించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ కోసం ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఈ వోఐ) దాఖలుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. తమ సంస్థ బిడ్లు దాఖలు చేసేందుకు అవకాశమివ్వాలని రాష్ట్ర ప్ర భుత్వరంగ సంస్థ సింగరేణి కేంద్రాన్ని కోరింది. సింగరేణి రిక్వెస్ట్ మేరకే ఈనెల 15వ తేదీనే ము గియాల్సిన టెండర్ల దాఖలు ప్రక్రియ గడువును ఐదు రోజులు పెంచారు. బిడ్ దాఖలుపై సింగరేణి ఉన్నతాధికారులు రెండు, మూడు రోజులుగా వైజాగ్ లోనే మకాం వేసి అవసర మైన ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ గురువారం మధ్యాహ్నం గడువు ముగిసే వరకు సింగరేణి సంస్థ తరపున ఎలాంటి బిడ్ దాఖలు కాలేదు.

విశాఖకు వెళ్లిన అధికారులు..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను టోకున తమ సన్నిహి తులకు అమ్మేస్తోందని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ సహా ఆ పార్టీ నేతలంతా కొంతకాలం గా విమర్శలు చేస్తన్నారు. ఈ క్రమంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన క్యాపిట ల్ ఇన్వెస్ట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణకు అర్హత ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు అవసరమైన క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ దాఖలుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో తమ ప్రభుత్వం పాల్గొనబోతున్నట్టు మీడియాకు లీకులు ఇచ్చారు.

ఆ తర్వాతి రోజే మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి టెండర్ దాఖలుకు ఉన్న అవకా శాలపై స్టడీ చేస్తున్నామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందన్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టే సింగరేణి ఉన్నతాధికారులు వైజాగ్ కు వెళ్లి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ లో పా - లొనడానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టారు. కానీ చివరి నిమిషం వరకు టెండర్ గ్ దాఖలు చేయకుండా సస్పెన్షన్ కు తెరతీశారు.

ఇతర సమస్యలు..

వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్లలో సింగరేణి పా ల్గొనాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్ప నిసరి, ఒకవేళ కేంద్రం పర్మిషన్ ఇవ్వకుండా బిడ్ దాఖలు చేసినా టెక్నికల్ బిడ్ల స్థాయిలోనే తెలంగాణ వేసే టెండర్ తిరస్కరణకు గుర వుతుంది. అదే జరిగితే తెలంగాణకు కనీసం టెండర్ వేయడం కూడా రాదనే అపప్రద ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరహాలోనే తెలంగాణలోని నిజాం షుగర్స్ సహా ఇతర సం స్థలను తిరిగి తెరిపించాలనే డిమాండ్ ప్రజల నుంచి వెళ్లువెత్తే అవకాశముంది.

అదే జరిగితే ఎన్నికలకు ముందు కొత్త సమస్యలు కోరి తె చ్చుకున్నట్టు అవుతోంది. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ ఈపీఐకి అంతర్జాతీయ సం స్థలతో పాటు దేశీయ కంపెనీలు బిడ్లు వేశాయి. ఏపీ ప్రజల తరఫున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనా రాయణ సైతం టెండర్ వేశారు. కేంద్రాన్ని ఇరుకున పెట్టే పేరుతో టెండర్ పాలిటిక్స్ చేస్తే స్వరాష్ట్రంలో అది తమకే ఇబ్బందికరంగా మా రుతుందనే చివరి నిమిషం బిడ్ దాఖలుకు ప్ర భుత్వ పెద్దలు నిరాకరించినట్టుగా తెలుస్తోంది.