ప్రభుత్వం సబ్సిడీపై కూరగాయలు అందించాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు కొని రాష్ట్రంలో సబ్సిడీ మీద అందించాలన్నారు. గురువారం గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ స్టేట్ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ నిర్వహించారు.
అనంతరం కూరగాయల ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. టమాటాలు, వివిధ కూరగాయలతో నిరసన తెలిపారు. పెరిగిన కూరగాయల ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సునీతారావు డిమాండ్ చేశారు. మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‑ హైదరాబాద్, వెలుగు