ప్రభుత్వం సబ్సిడీపై కూరగాయలు అందించాలి

ప్రభుత్వం సబ్సిడీపై కూరగాయలు అందించాలి

ప్రభుత్వం సబ్సిడీపై కూరగాయలు అందించాలని మహిళా కాంగ్రెస్​ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్​ చేశారు. పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు కొని రాష్ట్రంలో సబ్సిడీ మీద అందించాలన్నారు. గురువారం గాంధీ భవన్​లో మహిళా కాంగ్రెస్​ స్టేట్​ఎగ్జిక్యూటివ్​ కమిటీ మీటింగ్​ నిర్వహించారు. 

అనంతరం కూరగాయల ధరల పెరుగుదలను నిరసిస్తూ  ఆందోళన చేపట్టారు. టమాటాలు, వివిధ కూరగాయలతో నిరసన తెలిపారు. పెరిగిన కూరగాయల ధరలను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సునీతారావు డిమాండ్​ చేశారు. మధ్యతరగతి ప్రజలు కూరగాయలు కొనే  పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
‑ హైదరాబాద్, వెలుగు