- ఆ ప్రాజెక్టుకు సోర్స్ పోలవరమే
- పీపీఏ సమావేశంలో తెలంగాణ
- బ్యాక్ వాటర్ ముంపు సర్వే కోసం జాయింట్ కమిటీ
హైదరాబాద్, వెలుగు: ఏపీ చేపడుతున్న పోలవరం-–బనకచర్ల ప్రాజెక్టు విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ తేల్చి చెప్పింది. ఆ ప్రాజెక్టును నిర్మించకుండా ఏపీని నిలువరించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని కోరింది. ‘‘విభజన చట్టంలోని సెక్షన్ 90(4) ప్రకారం.. పోలవరం ఆధారంగా చేపట్టే ఏ ప్రాజెక్టుకైనా పీపీఏ ద్వారానే అన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ ప్రాజెక్టు నిర్మాణ అధికారం పీపీఏకే ఉంటుంది. బనకచర్ల లింక్ప్రాజెక్టుకు సోర్స్పోలవరమే. దీంతో ఆ ప్రాజెక్టు స్కోప్ మారిపోయింది. ఏపీ కట్టినట్టే ఎగువ రాష్ట్రాలూ ఇలాగే ప్రాజెక్టులను కట్టుకుంటూ పోతే దిగువ రాష్ట్రాలకు చుక్క నీరు కూడా రాదు” అని ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం హైదరాబాద్లోని కృష్ణా గోదావరి భవన్ఆఫీసులో పీపీఏ 17వ సమావేశం నిర్వహించారు. పీపీఏ సీఈవో, సీడబ్ల్యూసీ చైర్మన్అతుల్జైన్నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ అధికారులు వర్చువల్గా పాల్గొన్నారు.
పోలవరం కెపాసిటీ పెంచుతున్నది: తెలంగాణ
ఏపీ బనకచర్ల ప్రాజెక్టు కోసం పోలవరం కుడి కాల్వ, ట్విన్టన్నెల్స్కెపాసిటీని రెట్టింపు చేస్తున్నదని తెలంగాణ ఇరిగేషన్శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్బొజ్జా చెప్పారు. ‘‘ఏపీ ట్విన్టన్నెల్స్కెపాసిటీని 20 వేల నుంచి 40 వేల క్యూసెక్కులకు, కుడి కాల్వ సామర్థ్యాన్ని 10 వేల నుంచి 17,548 క్యూసెక్కులకు పెంచుతున్నది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నది. దీని వల్ల తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయి.
ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేంద్ర సంస్థలకు లేఖలు రాశాం” అని తెలిపారు. అయితే ఏపీ మాత్రం మరోసారి తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై వితండవాదం చేసింది. రాష్ట్ర భవిష్యత్అవసరాలను దృష్టిలో పెట్టుకునే పోలవరం ప్రాజెక్టును విస్తరిస్తున్నామని, సముద్రంలో కలిసే నీళ్లనే వాడుకునేలా ప్రాజెక్టును ప్రతిపాదించామని, అవి వరద జలాలని ఏపీ అధికారులు వాదించారు. దానిపై స్పందించిన రాహుల్ బొజ్జా.. అసలు వరద జలాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు.
నీటి కేటాయింపులు మా పని కాదు: పీపీఏ
తెలంగాణ అభ్యంతరాలపై పీపీఏ తమకేం సంబంధం లేదన్నట్టుగా బదులిచ్చింది. నీటి కేటాయింపుల పని తమది కాదని, ఆ సాంకేతికాంశాలు తమ పరిధిలోకి రావని పేర్కొంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, మెయింటెనెన్స్, ఆపరేషన్మాత్రమే తాము చూస్తామని పీపీఏ సీఈవో అతుల్ జైన్స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఫేజ్1ను 2027 డిసెంబర్నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ప్రాజెక్టు నుంచి వచ్చే న్యాయబద్ధమైన కేటాయింపులపై ఎవరూ ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని సూచించారు.
ముంపుపై సర్వే
పోలవరం బ్యాక్వాటర్తో ఆరు పెద్ద వాగుల ప్రవాహాలపై పడే ప్రభావం మీద సర్వే చేయాలని, రాష్ట్రంలో ప్రొటెక్షన్వర్క్స్చేపట్టాలని 2022 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని రాహుల్బొజ్జా అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వే చేసిన తర్వాత ఆ ఆరు వాగులతో పాటు కిన్నెరసాని, ముర్రేడు వాగుల డీమార్కేషన్చేపట్టాల్సి ఉందన్నారు.
ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే.. 40.250 మీటర్ల ఎత్తులో ఉండే భద్రాచలంలోని ఏటపాక ఔట్ఫాల్రెగ్యులేటర్మునిగిపోతుందని, ఫలితంగా భద్రాచలం మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన అతుల్ జైన్.. ఏపీ, తెలంగాణ, పీపీఏ అధికారులతో జాయింట్కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఆ కమిటీలోని అధికారులు ఔట్ఫాల్రెగ్యులేటర్ల వద్ద స్టడీ చేయిస్తారని, తుది నివేదిక అనంతరం ఆ ఔట్ఫాల్రెగ్యులేటర్ల ఆపరేషన్లపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పీపీఏ ప్రతిపాదనలకు రాహుల్బొజ్జా ఆమోదం తెలిపారు. కాగా, పీపీఏ ఆఫీసును హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించే ప్రతిపాదనపై చర్చించగా.. దానికి 16వ పీపీఏ మీటింగ్లో ఒప్పుకున్నామని రాహుల్బొజ్జా పేర్కొన్నారు.
