ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  జగన్‌ అక్రమాస్తుల కేసులో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్‌పై  జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రావణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.   హరిరామ జోగయ్య దాఖలు చేసిన సవరణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది.

సీఎం జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలంటూ హరిరామజోగయ్య పిల్‌ దాఖలు చేశారు. 2024లో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోపు కేసులను తేల్చేలా ఆదేశాలివ్వాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం ప్రతివాదులు జగన్‌, సీబీఐ, సీబీఐ కోర్టుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.