సర్కార్​ రేట్లతో.. కరోనా ట్రీట్‌మెంట్‌ ఇయ్యలేం

సర్కార్​ రేట్లతో.. కరోనా ట్రీట్‌మెంట్‌ ఇయ్యలేం

తెలంగాణ హాస్పిటల్స్ అండ్
 నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ 

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ట్రీట్‌మెంట్‌ టారిఫ్‌పై తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ( తానా) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సర్కార్‌‌ నిర్ణయించిన రేట్లతో కరోనా ట్రీట్‌మెంట్‌ అందించలేమని స్పష్టం చేసింది. ఇలాగైతే కరోనా చికిత్సలను నిలిపేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తానా అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ శనివారం లెటర్​రాశారు. ప్రభుత్వం ఈ నెల 22న విడుదల చేసిన టారిఫ్ ఉత్తర్వులపై ఆస్పత్రులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని ధరలు పెరిగాయని, సర్కారు నిర్ణయించిన ధరలు అశాస్త్రీయంగా ఉన్నాయని, వాటితో వైద్యం అందించలేమని తెలిపాయి. కరోనా వల్ల వైద్య సిబ్బంది జీతాలు 4 రెట్లు పెరిగాయని, స్పెషలిస్టుల కన్సల్టెన్సీ ఫీజులు కూడా పెరిగాయని వెల్లడించింది. టెస్టుల ఫీజులు, వసతుల కల్పన, విద్యుత్, బయో మెడికల్ వేస్టేజ్ చార్జీలతో పాటు ఆక్సిజన్‌ ధరలు పది రెట్లు పెరిగాయని చెప్పింది. కరోనా ట్రీట్‌మెంట్‌ ధరల టారిఫ్‌పై 2020 జూన్‌ 15న ఇచ్చిన జీవో కంటే తాజాగా ఇచ్చిన జీవో మరీ అధ్వానంగా ఉందని, దీనిపై హెల్త్‌ మినిస్టర్‌‌ కేసీఆర్‌‌ వెంటనే స్పందించాలని కోరింది.