
ట్యాంక్ బండ్, వెలుగు: తెలంగాణలో ఫస్ట్ టైం ఐపీఎల్ ప్రో కబడ్డీ తరహాలో బాస్కెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు. బుధవారం ట్యాంక్ బండ్ మరియట్ హోటల్లో ఫ్రీ లీగ్ కు సంబంధించిన లోగో, టీ షర్ట్ లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 3 నుంచి రెండు రోజుల పాటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో టోర్నమెంట్ నిర్వహిస్తామన్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ టీంలు పాల్గొంటాయని చెప్పారు. సమావేశంలో బాస్కెట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పృథ్వేశ్వర్ రెడ్డి, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.