
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఓ తెలంగాణ వ్యక్తి తప్పిపోయాడు. వివరాల ప్రకారం.. గద్వాల జిల్లాలోని మనోపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన వడ్డే మద్దిలేటి (52) తన భార్య లక్ష్మీదేవి, గ్రామస్తులు మొత్తం పదిమంది కలిసి 2025, మే 27న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. కర్నూలు నుంచి ట్రైన్లో బయలుదేరి 2025, మే 28న తిరుమల చేరుకున్నారు. అక్కడనుంచి అలిపిరి మెట్ల మార్గంలో మధ్యాహ్నం తిరుమల చేరుకుని ఉచిత దర్శనం క్యూలైన్లో వెళ్లి దర్శనం టికెట్లు పొందారు. వైకుంఠం కంపార్ట్మెంట్-7లో ఉండగా.. రాత్రి భక్తులను దర్శనానికి వదిలారు. ఈ రద్దీలో మద్దిలేటి తప్పిపోయారు.
దీంతో అతడి కోసం కుటుంబ సభ్యులు తిరుమల, తిరుపతి, రేణిగుంట చుట్టుపక్కల వెతకారు. ఎక్కడ మద్దిలేటి ఆచూకీ తెలియకపోవడంతో తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్ మద్దిలేటి భార్య లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన తన భర్త కనిపోయించకుండా పోయడాని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మద్దిలేటి కోసం గాలింపు మొదలుపెట్టారు. మద్దిలేటి ఆచూకీ తెలిసిన వారు 08772289027, 9440796771, 9581832190, 9014468661 నెంబర్లకు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.