కేటీఆర్ - జగన్ భేటీ

కేటీఆర్ - జగన్ భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రి, ఏపీ సీఎం జగన్ లు కలుసుకున్నారు. విదేశీ గడ్డపై వీరు కలిశారు. నా సోదరుడు ఏపీ సీఎం జగన్ తో గొప్ప సమావేశం జరిగిందని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. కలిసిన ఫోటోలను ట్వీట్ చేశారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ రాగా.. పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్లారు. ఆయన స్విట్జర్లాండ్, లండన్ లో పర్యటించారు. వీరి భేటీలో ఏ అంశాలపై చర్చించారో తెలియరాలేదు. ఏ అంశాలపై చర్చించారనే దానిపై క్లారిటీ రాలేదు. 

మరోవైపు పెట్టబడులే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పలువురు ప్రతినిధులను కలుస్తున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ కూడా పెట్టుబడుల కోసం ఆయన విదేశాల్లో పర్యటించారు. పలు కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు, పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తల కోసం : -

రాజమండ్రి జైలుకు ఏపీ ఎమ్మెల్సీ అనంత బాబు


రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు