- నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు రెండు వారాల్లో పూర్తి
- ఇప్పటికే ముగిసిన ప్రీ పోలింగ్ యాక్టివిటీ
- స్ట్రాంగ్ రూమ్లకు చేరిన బ్యాలెట్ బాక్సులు
- ఎన్నికల నిర్వహణకు రెడీగా ఆఫీసర్లు
- నేడు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
- పాల్గొననున్న రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని
- షెడ్యూల్ రిలీజ్కు అంతా రెడీ
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కేవలం 15 రోజుల్లో ముగియనున్నది. నామినేషన్ల స్వీకరణ నుంచి కౌంటింగ్ వరకు రెండు వారాల్లోనే ప్రాసెస్ను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కేవలం 15 రోజుల్లో ముగియనున్నది. నామినేషన్ల స్వీకరణ నుంచి కౌంటింగ్వరకు రెండు వారాల్లోనే ప్రాసెస్నుపూర్తిచేయనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రీ పోలింగ్ యాక్టివిటీనిపూర్తి చేసింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ఆఫీసర్ల (ఏఆర్వో)ను నియమించి ట్రైనింగ్ ఇచ్చింది.
పోలింగ్కు సరిపడా బ్యాలెట్బాక్స్లను తెప్పించి స్ట్రాంగ్రూమ్లలో భద్రపరిచారు. నామినేషన్లకు, పోలింగ్కు అవసరమైన మెటిరీయల్, బ్యాలెట్పేపర్లను రెడీ చేశారు. పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర పోలింగ్ సిబ్బంది పేర్లను టీ పోల్స్ లో నమోదు చేశారు.
నోటిఫికేషన్ రిలీజైన వెంటనే ర్యాండమైజేషన్ చేసి అవసరమైన ఉద్యోగులను నియమించనున్నారు. ఈ క్రమంలో నేడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం లేక బుధవారం మున్సిపల్ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
అంతా 15 రోజుల్లేనే..
రాష్ట్రంలో గడువు ముగిసిన 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలోని 2,996 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఆయా బల్దియాల పరిధిలోని వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటించారు. మొత్తం 15 రోజుల వ్యవధిలో ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఆఫీసర్లు సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన మొదటి రోజు నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 4వ రోజు నామినేషన్ల పరిశీలన, స్క్రూటినీ ఉంటాయి.
5వ రోజు తిరస్కరించిన నామినేషన్లపై ఆర్వోల దగ్గర అభ్యంతరాలు స్వీకరించి తిరిగి పరిశీలన చేస్తారు. 6వ రోజు జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ (కలెక్టర్)కు అందిన ఫిర్యాదులను పరిశీలిస్తారు. 7వ రోజు పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరుగుతుంది. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ పూర్తయ్యాక ఒక రోజు గడువిచ్చి మరుసటి రోజు కౌంటింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు చెప్తున్నారు.
ఆర్వో, ఏఆర్వోల ట్రైనింగ్ పూర్తి
ఎన్నికల్లో అతి కీలకమైన రెండో ఘట్టం పోలింగ్ నిర్వహణ. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్8,195 పోలింగ్స్టేషన్లను గుర్తించింది. వీటిలో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో సుమారు 700 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.
బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం భావించడంతో ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో టైమ్ ఎక్కువగా తీసుకుంటుందనే అభిప్రాయంతో ఎక్కువ సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో 1,390 మంది ఆర్వోలు, 1,480 మంది ఏఆర్వో లు పాల్గొననున్నారు. వీరి వివరాలను జిల్లాలవారీగా టీ పోల్ యాప్లో నమోదు చేశారు.
