యాదగిరిగుట్ట, వెలుగు : గవర్నర్ శివప్రతాప్ శుక్లా గురువారం యాదగిరిగుట్టకు రానున్నారు. బుధవారం గవర్నర్గా ప్రమాణస్వీకారం చేసిన ఆయన గురువారం ఉదయం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు.
ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని లోక్భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటల వరకు యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. కొండపైన వీఐపీ గెస్ట్హౌజ్లో ఫ్రెష్అయిన అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వయంభు నారసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
తర్వాత తిరిగి రోడ్డు మార్గంలోనే హైదరాబాద్కు పయనం అవుతారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే నారసింహుడిని దర్శించుకోవడానికి వస్తుండడంతో ప్రొటోకాల్ సమస్యలు రాకుండా ఆలయ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
