హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లు ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ఫేస్బుక్ పేజీనే హ్యాక్ చేసి అందులో బూతు వీడియోలు అప్లోడ్ చేయడం సంచలనం సృష్టించింది. సామాన్యులు సైబర్ నేరాల బారిన పడటం సాధారణమైపోయింది. వీటి నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నా.. అనుకున్న మేర సక్సెస్ కాలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ మోసాలు నిరోధించడం, వారి ఉచ్చులో పడకుండా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఐదు పాయింట్ల ఫార్ములాను విడుదల చేసింది.
పాస్వర్డ్లు..
సోషల్ మీడియా, ఆన్లైన్బ్యాంకింగ్, ఈ మెయిల్ తదితర ప్లాట్ఫాంలకు దేనికదే ప్రత్యేకమైన పాస్ వర్డ్లు ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. చాలా వాటిల్లో ఒకే పాస్వర్డ్ ఉపయోగించడం వల్ల మోసానికి గురయ్యే ప్రమాదం పెరుగుతుందని వారు వెల్లడించారు. వ్యక్తుల పేర్లు, పుట్టిన తేదీలు తదితర వ్యక్తిగత సమాచారం బేస్ చేసుకుని పెట్టే పాస్వర్డ్లను యూస్ చేయవద్దని, పెట్టిన పాస్వర్డ్లను ఎవరితో షేర్ చేయవద్దని సూచిస్తున్నారు.
విశ్వసనీయతే ప్రాధాన్యం..
ఇంటర్నెట్లో సర్చ్ చేస్తున్నప్పుడు సైట్కి సంబంధించిన పాప్ అప్స్ లాంటివి వస్తే వాటిని యాక్సెప్ట్ చేసే విషయం దాని విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా యాప్ లు డౌన్లోడ్ చేసేముందు వాటికి రేటింగ్లు, వినియోగదారులు ఇచ్చిన రివ్యూలు అన్ని చెక్ చేయాలి.
అప్డేట్గా ఉంచాలి..
ల్యాప్టాప్లు, ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల సాఫ్ట్వేర్లను నిత్యం అప్టు డేట్ గా ఉంచాలి.
యాంటీ వైరస్
డిజిటల్ భద్రత మెరుగుపరచడానికి నమ్మకమైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించడం మేలు.
లింక్లు క్లిక్ చేయవద్దు..
వాట్సప్, ఈ మెయిల్, మెసేజ్ల ద్వారా అన్నౌన్ నంబర్ నుంచి మెసేజ్లు వస్తే వాటిని క్లిక్ చేయకపోవడమే మంచిది. ఈ లింకులు, యూఆర్ఎల్లను సైబర్ నేరగాళ్లు ప్రజల్ని మోసం చేయడానికి ఉపయోగిస్తారు. వీటన్నింటినీ ఫాలో కావడం ద్వారా సైబర్నేరాలను గణనీయంగా తగ్గించవచ్చు.

