
ఏటూరునాగారం/ ఎల్కతుర్తి/ హనుమకొండ సిటీ, వెలుగు: గంజాయి, డ్రగ్స్ని నిర్మూలించి, భావితరాలకు మంచి భవిష్యత్ ఉండేలా ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. మిషన్ పరివర్తన నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఏటూరునాగారంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, హనుమకొండలోని అంబేడ్కర్ భవన్ లో జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, ఎల్కతుర్తి మండల కేంద్రంలో సీఐ పులి రమేశ్ అవగాహన కల్పించారు.
అనంతరం ఏటూరునాగారంలో ఏఎస్పీ సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్ కుమార్ తో కలిసి మత్తు పదార్థాలు వాడటం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పోస్టర్లను ఆవిష్కరించారు. హనుమకొండలో ఏసీపీ నరసింహారావు, సైక్రియాటిస్టు ప్రహసిత్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తదితరులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు.