- గాంధీ ఆస్పత్రిలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ తనిఖీలు
పద్మారావునగర్, వెలుగు : గాంధీ ఆస్పత్రి లోని పేషెంట్లు, డ్యూటీ డాక్టర్లకు ఫుడ్ అందించే డైట్క్యాంటీన్ను రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు కె.గోవర్ధన్ రెడ్డి, ఆనంద్, భారతి, శారద బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డుల్లో తిరుగుతూ మెనూ ప్రకారం ఫుడ్ ఇస్తున్నారా..? నాణ్యత ఎలా ఉందని అడిగి తెలుసుకోగా బాగుందని పేషెంట్లు చెప్పారు. గాంధీ ఆస్పత్రికి 90 శాతం పేద ప్రజలే ట్రీట్మెంట్ కు వస్తారని, వారికి నాణ్యమైన, పోషకాలతో కూడిన ఫుడ్ అందించాలని సూచించారు.
సెల్లార్ లోని క్యాంటీన్ ను కొత్తగా నిర్మిస్తున్న భవనంలోకి త్వరలో షిప్టు చేయనున్నట్లు సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు తెలిపారు. చీఫ్ డైటీషీయన్ రమేశ్, డైట్ క్యాంటీన్ నిర్వాహకులు రవికుమార్ ఉన్నారు.