ఒక్క రోజులో 3 ప్లేస్లు చూసొద్దామా..వీకెండ్ ప్యాకేజీ ప్రవేశపెట్టిన టూరిజం

ఒక్క రోజులో 3 ప్లేస్లు చూసొద్దామా..వీకెండ్ ప్యాకేజీ ప్రవేశపెట్టిన టూరిజం
  •      పెద్దలకు రూ.2100,  పిల్లలకు రూ.1800
  •     ఏసీ బస్సులో జర్నీ, ఎంట్రీ టికెట్లు,  టీ, భోజనం అన్నీ వాళ్లవే 

హైదరాబాద్​సిటీ, వెలుగు : జంటనగరాల ప్రజల కోసం తెలంగాణ టూరిజం సరికొత్త వీకెండ్ ప్యాకేజీని ప్రకటించింది. చిలుకూరు బాలాజీ టెంపుల్, ఎక్స్‌‌పీరియం ఎకో పార్క్, కొత్వాల్​గూడ ఎకో టూరిజం పార్క్ లను ఓకే రోజులో విజిట్​చేసేలా వీకెండ్​ప్యాకేజీ టూర్​ను ప్లాన్​ చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం ఈ టూర్​ఉండనున్నది. 

షెడ్యూల్ ఇలా....

ఉదయం 7 గంటలకు మినీ ఏసీ బస్సులో సికింద్రాబాద్‌‌ యాత్రి నివాస్ నుంచి 7.15 గంటలకు స్టార్టవుతారు. తర్వాత బేగంపేట్‌‌లోని పర్యాటక భవన్ కు వచ్చి అక్కడి నుంచి బయలుదేరి7:30 కు బషీర్‌‌బాగ్‌‌లోని చీఫ్​రిజర్వేషన్​ఆఫీసు ప్రాంతానికి చేరుకుంటారు. తర్వాత 8 గంటలకు తారామతి బారాదరికి చేరుకుంటారు. టిఫిన్​చేశాక 9గంటలకు చిలుకూరు టెంపుల్​దర్శనం ఉంటుంది. 11:30 గంటలకు ఎక్స్‌‌పీరియం ఎకో పార్క్ వెళ్తారు. 2 గంటలకు శాఖాహార భోజనం తర్వాత 3:30 గంటలకు కొత్వాల్‌‌గూడ ఎకో టూరిజం పార్క్ సందర్శన ఉంటుంది. 5:30 గంటలకు హై-టీ ఇస్తారు. 7 గంటలకు బయలు దేరి బషీర్‌‌బాగ్‌‌లోని సీఆర్​ఓకి చేరుకుంటుంది. 

అన్నీ కలిపి రూ.2100..

టిఫిన్, వెజ్​మీల్స్​, హై-టీ, అన్ని ప్రదేశాల ప్రవేశ టిక్కెట్లు, టోల్, పార్కింగ్ చార్జీలు, టూర్ గైడ్ సేవలు అన్నీ కలుపుకుని పెద్దలకు ఒక్కొక్కరికి 2,100, -పిల్లలకు ఒక్కొక్కరికి1,800 చార్జీలుగా నిర్ణయించారు. బుకింగ్‌‌లు, మరిన్ని వివరాలకు టూరిజం బుకింగ్ ఆఫీస్‌‌ను 9848126947, 9848125720, 9848306435 నంబర్లలో సంప్రదించవచ్చు.