గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్ల గడువు పొడిగింపు..

గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్ల గడువు పొడిగింపు..

వాహనాల పెండింగ్ చలాన్ల గడువును పెంచింది ప్రభుత్వం.ఇవాళ్టితో గడువు ముగుస్తుండటంతో   జనవరి 31 వరకు గడువును  పెంచుతున్నట్లు ప్రకటించింది. పెండింగ్ చలాన్లు చెల్లించనివారు గడువులోగా చెల్లించాలని సూచించింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం డిస్కౌంట్,ఆర్టీసీ బస్సులకు 90 శాతం ,ఇతర వాహనాలకు 60 శాతం డిస్కౌంట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో పెండింగ్ చాలాన్లపై ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించినా.. వాహనాదారులు మాత్రం  పేమెంట్స్ కు ఆసక్తి చూపలేదు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. అయితే, వాహనాదారులు ఈ ఆఫర్ ను వినియోగించుకునేందుకు పెద్దగా ముందుకు రాలేదు.

14 రోజుల్లో 32 శాతమే పేమెంట్ చాలాన్లు కట్టారు వాహనదారులు.  3 కోట్ల 59 లక్షల పెండింగ్ చాలాన్లు ఉంటే.. కోటీ 14 లక్షలు మాత్రమే క్లియర్ చేశారు . దీంతో రూ.100 కోట్ల వరకు ప్రభుత్వానికి  ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో 45 రోజుల్లో 60 శాతం చాలాన్లు క్లియర్ చేయడంతో 200 కోట్లు వచ్చాయి. జిల్లా, గ్రామాల్లో పెండింగ్ చలాన్ పేమెంట్స్ తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.