గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్లో ట్రీట్మెంట్ పొందుతున్న కరోనా పాజిటివ్ పేషెంట్లు కోలుకుంటున్నారు. డాక్టర్లు వారికి బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రాష్ర్టంలో ఆదివారం నాటికి మొత్తం 70 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఫస్ట్ కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు 12 రోజులు ట్రీట్మెంట్ పొంది పూర్తిగా కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం 43 మంది గాంధీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ పేషెంట్లలో ఒక్కరు వెంటిలేటర్ పై ఉండగా, మిగిలిన అందరూ సాధారణ ఐసోలేషన్లో ఉన్నారని సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. వేగంగా కోలుకున్న 11 మందిని ఫైనల్ చెకప్ తర్వాత సోమవారం డిశ్చార్జ్ చేస్తారు. వీరు మస్ట్గా ఇంట్లో 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం గాంధీలో 143 మంది కరోనా సస్పెక్టర్స్ డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నారు. వీరిలో కొందరు జ్వరం, బీపీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుండగా అవసరమైన మెడిసిన్, ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు. యాంటీ బయాటిక్స్కూడా ఇస్తున్నారు. ఐసోలేషన్లో ఉన్న వారిలో దాదాపు సగానికి పైగా పాజిటివ్ పేషెంట్లు 40–-50 ఏండ్ల మధ్య ఏజ్ వారే. వీరికి ఇతర ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ లేకపోవడంతో త్వరగా కోలుకొనే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. యంగ్స్టర్స్ ఫాస్ట్గా కోలుకునే చాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు. పాజిటివ్ పేషెంట్లలో ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు పౌష్ఠికాహారం అందిస్తున్నారు.
హై క్వాలిటీ ఫుడ్
ఐసోలేషన్ట్రీట్మెంట్ పొందుతున్న కరోనా పేషెంట్లకు పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నారు. విటమిన్లు, మినరల్స్ మిక్స్డ్ హై క్వాలిటీ ఫుడ్ ఇస్తూ వారిలో ఇమ్యూనిటీ పవర్పెరిగేలా డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఫుడ్, ఫెసిలిటీస్పై పేషంట్లు సంతృప్తిగా ఉన్నారు. ఫుడ్ ఐటమ్స్ ప్యాక్ చేసి ఇస్తున్నారు. డ్రింకింగ్కు మినరల్ వాటర్ అందిస్తున్నారు. మెనూలోని ఫుడ్ టైమ్కు కాకుండా వారు అడిగినప్పుడల్లా ఇవ్వడానికి డైట్కంపెనీకి చెందిన ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
అందుబాటులోకి రెండు ఎమర్జెన్సీ వార్డులు
గాంధీ ఓపీ బిల్డింగ్లోని క్యాజువాలిటీ ఎమర్జెన్సీలోని రెండు ఐసోలేషన్ వార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం నుంచి ఈ వార్డుల్లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. క్యాజువాలిటీలోని గ్రౌండ్ ఫ్లోర్లో 65, రెండో ఫ్లోర్లో 52 బెడ్లు కొత్తవి ఉండగా కరోనా సస్పెక్టర్స్కు కేటాయించారు.
సూపరింటెండెంట్ డా.పి.శ్రవణ్ నేతృత్వంలో ఏర్పాటైన కొవిడ్–19 కోర్కమిటీ ఆదివారం సమావేశమైంది.
కరోనా వైద్య సేవలు, ఇతర సౌకర్యాల కల్పనకు ఉద్దేశించిన 16 విభాగాల కమిటీలు ఇచ్చిన సూచనలను కోర్ కమిటీ సభ్యులు చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాన్ని రోజుకు రెండు సార్లు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ పేషెంట్లందరూ నెగిటివ్గా మారి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఐసోలేషన్లో ఉన్నోళ్లకు..
ఉదయం : కాఫీ, బిస్కెట్
బ్రేక్ఫాస్ట్: ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం (రోజుకో రకం)
లంచ్: వండిన రైస్, వెజ్కర్రీ, దాల్, సాంబారు, బాయిల్డ్ ఎగ్, పెరుగు, ఆరటిపండు/ఆరెంజ్ఫ్రూట్
సాయంత్రం 4 గంటలకు: కాఫీ, జీడి పప్పు, బాదం పప్పు, కర్జూరు పండ్లు, అంజీర్
రాత్రి డిన్నర్: వండిన రైస్, వెజ్కర్రీ, దాల్, సాంబారు, ఎగ్, ఏదేని ఫ్రూట్, పాలు
టైమ్పాస్కు వై ఫై ఫెసిలిటీ
గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డ్ లలో ట్రీట్మెంట్ పొందుతున్న కరోనా పాజిటివ్ పేషెంట్ల టైమ్పాస్ కోసం ఫ్రీ వైఫై ఫెసిలిటీని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. రోజులుగా బెడ్లకే పరిమితమైన వీరికి ఎంటర్టైన్మెంట్ కలగనుంది. వైఫై తో మొబైల్, ల్యాప్ ట్యాప్ లలో యూ ట్యూబ్, టిక్ టాక్ , మూవీస్ లాంటివి చూస్తూ హ్యాపీగా ఉంటున్నారు. కరోనా పాజిటివ్ పేషెంట్లు ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నా రని, వారికి అవసరమైన అన్నిరకాల ఫెసిలిటీస్ కల్పిస్తున్నామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.పి.శ్రవణ్కుమార్ తెలిపారు.