హైదరాబాద్, వెలుగు: పుణెలో ఇటీవల జరిగిన జాతీయ కళా ఉత్సవ్ పోటీల్లో డ్యాన్స్ విభాగంలో తెలంగాణకు చెందిన మైథిలీ తేజల్ రెండో స్థానంలో నిలిచింది. శనివారం ఆమెను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో డైరెక్టర్ నవీన్ నికోలస్ సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అధికారులు రాధారెడ్డి, రాజీవ్, వెంకట నర్సమ్మ, తాజ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
