
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ 'తండేల్' (Thandel). 2025 ఫిబ్రవరి 7న పాన్ ఇండియా భాషల్లో రిలీజైన ఈ మూవీ వందకోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఇపుడీ ఈ మూవీ హిందీ టెలివిజన్ ప్రీమియర్కు సిద్ధమైంది. సోనీ మాక్స్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఆదివారం, జూన్ 15న రాత్రి 8:00 గంటలకు ప్రసారం కానుందని సోనీ మాక్స్ అధికారికంగా ప్రకటిస్తూ ట్వీట్ చేసింది.
Humare hero aur director toh Satya se kafi impressed hai. Ab time aa gaya hai ki aap bhi dekhein Satya ki energy, uska pyaar aur kaise usne Raju ka saath kabhi nahi chora. Catch the World Television Premiere Thandel on 15th June at 8:00 pm, sirf Sony MAX par #Thandel #SonyMAX pic.twitter.com/4iBFAl3Vk8
— Sony MAX (@SonyMAX) June 13, 2025
తండేల్ విషయానికి వస్తే..
తండేల్ మూవీ 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూళ్లతో, చైతన్య కెరీర్లోనే ల్యాండ్ మార్క్ సాధించింది. ఇండియాలో 12 రోజుల్లో రూ.60 కోట్ల నెట్ కలెక్షన్లు చేసింది. ఫిబ్రవరి 7న థియేటర్స్ లో రిలీజైన ఈ మూవీ మార్చి 7న ఓటీటీకి వచ్చేసింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ & మలయాళం భాషల్లో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఏకంగా రూ.40 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. నాగ చైతన్య కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ డీల్. అలాగే తండేల్ శాటిలైట్ రైట్స్ హక్కులను జీ తెలుగు టీవీ ఛానెల్ కూడా మంచి ధరకే సొంతం చేసుకుంది. ఇపుడీ సోనీ మాక్స్ సైతం తండేల్ హిందీ ప్రసార హక్కులను ఫ్యాన్సీ రేటుకే దక్కించుకుంది.
Thandel guri eppudu thappadu! ochesadu! Inka rajulamma jaatharey 😎🔥
— Netflix India South (@Netflix_INSouth) March 7, 2025
Watch Thandel, now on Netflix in Telugu, Hindi, Tamil, Kannada & Malayalam!#ThandelOnNetflix pic.twitter.com/XPWhDQfeR2
తండేల్ కథ:
తండేల్ మూవీ శ్రీకాకుళం మత్స్యకారుడు రాజు జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో రాజు-సత్యల మధ్య ఉన్న ప్రేమకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. రాజు సముద్రంలోకి చేపల వేటకి వెళ్లడం, ఆ తర్వాత 22 మందితో కూడిన 3 బొట్లు పాకిస్థాన్ సరిహద్దుకు చేరడం, దాంతో అక్కడి పాకిస్థాన్ జైల్లో బంధించబడటం వంటి అంశాలు ఆసక్తిగా తెరకెక్కాయి. శ్రీకాకుళానికి చెందిన జాలర్లకు భారత ప్రభుత్వం ఏ విధంగా సహకరించింది? అక్కడి నుండి రాజు బయటపడి బుజ్జితల్లి ప్రేమను దక్కించున్నాడా లేదా అనేది ప్రధాన కథగా తండేల్ రూపొందింది.