
ముషీరాబాద్, వెలుగు: ఓ టీవీ చానెల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ వోటర్కర్ సూసైడ్చేసుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్లో తాను నివసిస్తున్న ఇంటిలోనే శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
రాంనగర్ వైఎస్సార్ పార్క్ సమీపంలోని ఒక ఇంట్లో ఉండే స్వేచ్ఛ కొన్ని రోజుల కింద తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవిలతో కలిసి జవహర్ నగర్ లోని ఇంటికి మారారు. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.