టెంపరేచర్లు మళ్లీ పెరిగినయ్

టెంపరేచర్లు మళ్లీ పెరిగినయ్

  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒక్కరోజు తగ్గిన టెంపరేచర్లు.. మళ్లీ పెరిగాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా రాయినిగూడెంలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా దామరచర్లలో 44.3, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 43.8, సూర్యాపేట జిల్లా మునగాలలో 43.6, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఆదిలాబాద్ జిల్లా అర్లి టి, నిర్మల్ జిల్లా తానూరులలో 43.5, కామారెడ్డి జిల్లా సర్వాపూర్​లో 43.4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 43.1, జయశంకర్​భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, నిర్మల్ జిల్లా కుంటాలలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

హైదరాబాద్​లో 40.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్​భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల మధ్య టెంపరేచర్స్ నమోదయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. గురువారం కూడా పలుచోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.