‘ఆలయ నిర్మాణం’ పుస్తకావిష్కరణ

 ‘ఆలయ నిర్మాణం’ పుస్తకావిష్కరణ

బషీర్​బాగ్, వెలుగు: శిల్పాగమ శాస్త్రాలను అనుసరించి రచించిన ‘ఆలయ నిర్మాణం’ పుస్తకాన్ని సీఎం సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి హైదరాబాద్​లో ఆదివారం ఆవిష్కరించారు. రచయిత డా. పి. సుబ్రమణి, డా. ఈమని శివనాగిరెడ్డి సంపాదకత్వంలో రూపొందిన ఈ పుస్తకంలో భూ పరీక్ష నుంచి ప్రతిష్ఠ వరకు, ఉపపీఠం నుంచి కలశం, గర్భాలయం నుంచి గోపురం వరకు ఆలయ నిర్మాణ దశలను, డిజైన్లతో సహా వివరించారన్నారు.

 ఈ పుస్తక ముద్రణకు ఆర్థిక సహాయం చేసిన ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగళ్ల రాజిరెడ్డిని అభినందించారు. దేవాదాయ శాఖ, తితిదే దేవస్థానాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయ నిర్మాణ శిల్పులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, శిల్పి బి. వెంకటరెడ్డి ఉన్నారు.