వీపనగండ్ల, వెలుగు : వనపర్తి జిల్లా వీపన గండ్ల మండలం గోవర్ధనగిరికి చెందిన కౌలు రైతు పిట్టల రమేశ్(45) అప్పుల బాధతో సూసైడ్ చేసుకున్నాడు. అతడు మరో నలుగురు రైతులతో కలిసి మామిడి తోటలను కౌలుకు తీసుకున్నాడు. ఆశించినంత దిగు బడి రాకపోవడంతో అప్పులు పెరిగాయి.
ఫెర్టి లైజర్స్ డబ్బులు కట్టాలని షాపు యజమాని అడగడంతో రమేశ్ .. మామిడి తోటలకు వాడే పురుగుమందును తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్కు రూ.5 లక్షల దాకా అప్పు ఉందని స్థానికులు తెలిపారు. రమేశ్ భార్య రెండేళ్ల కిందటే చనిపోయింది. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
