న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశానికి సంబంధించి లెజెండరీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ , వీవీఎస్ లక్ష్మణ్కు బీసీసీఐ అంబుడ్స్ మన్ డీకే జైన్ నోటీసులు జారీ చేశారు. క్రికెట్ అడ్వైజరీ కమిటి (సీఈసీ) లో కొనసాగుతూ ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో సచిన్ (ముంబై), లక్ష్మణ్ (సన్ రైజర్స్ ) మెంటార్ లుగా కొనసాగడంపై ఫిర్యాదు రావడంతో జైన్ వివరణ కోరారు. ఈనెల 28 లోగా అఫిడవిట్ జతపరిచి లిఖితపూర్వకంగా జవాబివ్వాలని సూచించారు.