కూకట్‌‌‌‌పల్లిలో ఉద్రిక్తత: డబ్బులు పంచుతూ దొరికిన టీఆర్ఎస్ నేతలు

కూకట్‌‌‌‌పల్లిలో ఉద్రిక్తత: డబ్బులు పంచుతూ దొరికిన టీఆర్ఎస్ నేతలు

హౌసింగ్ బోర్డ్: కూకట్‌‌పల్లిలోని హౌసింగ్ బోర్డ్ ‌లో జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌‌ ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతుండటాన్ని బీజేపీ కార్యకర్తలు గుర్తించారు. గులాబీ నేతలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పరిస్థితి విషయమించడంతో రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. టీఆర్ఎస్ నేతలు వెళ్తున్న కారును బీజేపీ కార్యకర్తలు వెంబడించారు. ఒక బీజేపీ కార్యకర్త ఆ కారు బానెట్‌‌పై ఎక్కాడు. అయితే కారును ఆపకుండా వెళ్లిపోవడంతో అతడు కిందపడిపోయాడు. ఆ కారులో లక్షల రూపాయలు ఉన్నాయని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ఆ డబ్బులను తీసుకొచ్చారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.