
- హెచ్సీయూ అడ్మినిస్ట్రేషన్కు వ్యతిరేకంగా నినాదాలు
- రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- లేదంటే నిరవధిక దీక్షకు దిగుతామని హెచ్చరిక
గచ్చిబౌలి, వెలుగు: పదవీ కాలం పూర్తి కాకముందే ఎన్నికైన స్టూడెంట్స్ యూనియన్ను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని హెచ్సీయూ అడ్మినిస్ట్రేషన్పై విద్యార్థి సంఘాల లీడర్లు మండిపడ్డారు. బుధవారం (సెప్టెంబర్ 10) వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు 12 విద్యార్థి సంఘాలకు చెందిన వారు ఆందోళన చేపట్టారు.
పదవీ కాలం ముగియక ముందే వర్సిటీ స్టూడెంట్ యూనియన్నురద్దు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, లింగ్డో కమిటీ సిఫార్సులను ఉల్లంఘించడమేనన్నారు. ఇటీవల హెచ్సీయూ విద్యార్థి సంక్షేమ డీన్తో జరిగినసమావేశంలో ఏబీవీపీ తప్ప మిగిలిన సంఘాలు.. యూనియన్కు పదవీ కాలం పూర్తి చేసే అవకాశం ఇవ్వాలని తీర్మానించాయన్నారు.
అయినప్పటికీ అడ్మినిస్ట్రేషన్ ఏబీవీపీకి అనుకూలంగా, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఈ చర్య విద్యార్థుల స్వయం ప్రతిపత్తిపై దాడిగా అభివర్ణించారు. రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే నిరవధిక నిరాహార దీక్ష చేపడుతామని ప్రకటించారు.