రేపు పదో తరగతి, ఎల్లుండి టెట్ ఫలితాలు

రేపు పదో తరగతి, ఎల్లుండి టెట్ ఫలితాలు

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 30న టెన్త్, జులై 1న టెట్ రిజల్ట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అధికారులు మంగళవారం వేర్వేరు ప్రకటనలు రిలీజ్ చేశారు. టెన్త్ ఫలితాలు శుక్రవారం ఉదయం 11.30కు మంత్రి సబిత రిలీజ్ చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.