బర్త్​డే నాడే.. బావిలో శవమైన టెన్త్ విద్యార్థి

బర్త్​డే నాడే.. బావిలో శవమైన టెన్త్ విద్యార్థి

బర్త్​డే నాడే.. బావిలో శవమై..

టెన్త్​ స్టూడెంట్​ మృతి

హత్య చేశారని తండ్రికి డౌట్​

మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో  విషాదం చోటుచేసుకుంది. బర్త్ డే వేడుకలు జరుపుకోవాల్సిన కొడుకు బావిలో శవమై తేలడంతో ఫ్యామిలీమెంబర్స్​ కన్నీరు మున్నీరయ్యారు. మ్యాడంపల్లికి  టెన్త్ స్టూడెంట్ జలంధర్​  ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లి రాత్రి వరకు తిరిగిరాలేదు.  ఎంత  వెతికినా అతని జాడ తెలియకపోవడంతో ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సోమవారం  గ్రామ శివారులోని వ్యవసాయ బావి దగ్గర  చెప్పులు కనిపించాయి.  బావిలో వెతకగా జలందర్​ శవం కనిపించింది. అయితే .. తన కొడుకును చంపేసి బావిలో వేశారని అతని తండ్రి నాగేందర్‌  అనుమానం వ్యక్తం చేశారు. గ్రామానికే చెందిన ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం హత్యకు కారణమని, ఆమె బంధువులే చంపి ఉంటారని  ఆరోపించారు. కేసు దర్యాప్తులో ఉంది.

For More News..

సింగరేణిలో కిరాయి బండ్ల బినామీ దందా

రిజిస్ట్రేషన్ కొత్త రూల్స్​తో గందరగోళం.. పొద్దంతా సర్వర్‌‌ తిప్పలు

60 ఏళ్లు దాటిన రైతులకు 3వేల పెన్షన్​ ఇచ్చే ఆలోచనలో కేంద్రం