జమ్ముూ కాశ్మీర్లో ఆర్మీ ట్రక్పై ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముూ కాశ్మీర్లో ఆర్మీ ట్రక్పై ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో గురువారం (డిసెంబర్21)  జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు సైనికులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గురువారం మధ్యాహ్నం 3.45 గంటలకు రాజౌరీ లోని పూంచ్ ప్రాంతంలో డేరా కీ గలీ గుండా వెళ్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు మెరుపు దాడి చేయడంతో ఎదరు కాల్పులు జరిపారు ఆర్మీ జవాన్లు. 

బుధవారం రాత్రి నుంచి సైన్యం డీకేజీ ఏరియా , దాని పరిసర ప్రాంతాల్లో పక్కా సమాచారంతో ఆర్మీ ఆపరేషన్ నిర్వహించింది. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం ఉగ్రవాదులకు నిలయంగా మారడంతో పాటు సైన్యం పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తోంది. గత రెండేళ్లలో డీకేజీ ఏరియా అయిన డేరా కీ గలీ లో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ లో 35మంది సైనికులు వీరమరణం పొందారు.