బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై టెర్రరిస్టుల దాడి

బీఎస్‌ఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై టెర్రరిస్టుల దాడి

కుల్గాం: జమ్ము కశ్మీర్‌‌లో ఉగ్రవాదులు మరోసారి సైనికులపై దాడికి దిగారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ (బీఎస్‌ఎఫ్​) జవాన్లతో వెళ్తున్న కాన్వాయ్‌పై కాల్పులకు దిగారు. జమ్ము కశ్మీర్‌‌లోని కుల్గామ్‌ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది.

శ్రీనగర్‌‌ నుంచి జమ్ముకు బీఎస్‌ఎఫ్​ సైనికుల కాన్వాయ్ వెళ్తుండగా నేషనల్ హైవేపై మాల్‌పొరా ప్రాంతంలో కొందరు ముష్కరులు దాడికి దిగారు. ఉన్నట్టుండి కాల్పులకు పాల్పడడంతో జవాన్లు అప్రమత్తమయ్యారు. వెంటనే కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. ఈ ఘటనలో మన జవాన్లకు ఎవరికీ గాయాలు కాలేదని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్‌‌ చెప్పారు. టెర్రరిస్టులకు, మన బలగాలకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయని చెప్పారు. ముగ్గురు టెర్రిరిస్టులు ఆ స్పాట్‌లో ఉన్నట్టు తెలుస్తోందని చెప్పారు. సీనియర్ పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ ఉన్నతాధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారన్నారు.