గద్దర్ అవార్డుల్లో.. తెలంగాణ కళాకారులకు అన్యాయం: TFCC ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ

గద్దర్ అవార్డుల్లో.. తెలంగాణ కళాకారులకు అన్యాయం: TFCC ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ

తెలుగు చిత్ర పరిశ్రమలో మొదలైన థియేటర్స్ సమస్యకు ఇండస్ట్రీలోని ఆ నలుగురే కారణం అన్నారు టీఎఫ్సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. సోమవారం నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో ఆయన మాట్లాడుతూ ‘ఆ నలుగురే తమ స్వార్థంతో థియేటర్స్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను నాశనం చేస్తున్నారు.

దిల్ రాజు ఎఫ్ డీసీ ఛైర్మన్‌‌గా తన అధికారాలను దుర్వినియోగం చేశాడు. తన వాళ్లకే గద్దర్ అవార్డ్స్ ఇచ్చుకున్నాడు. కమిటీలో ఉన్నవాళ్ల సినిమాలకు అవార్డ్స్ ఇవ్వకూడదనే నిబంధనలు కూడా పాటించలేదు.

ఈ అవార్డ్స్‌‌లో తెలంగాణ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అన్యాయం జరిగింది. థియేటర్స్ బంద్ ఇష్యూలోనూ దిల్ రాజు ప్రమేయం ఉంది’ అని  అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2), ఉత్తమ నటిగా నివేదా థామస్ (35 చిన్న కథ కాదు), ఉత్తమ డైరెక్టర్గా కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్ అవార్డ్స్ దక్కించుకున్నారు.