పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ స్టార్ట్ చేసి అతి తక్కువ టైమ్లోనే ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేసే సంస్థగా నిలిపారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. రీసెంట్గా రవితేజతో ‘ధమాకా’ లాంటి హిట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘శుక్రవారం రిలీజైన ‘ధమాకా’కు గ్రాండ్ ఓపెనింగ్స్ వచ్చాయి. అన్ని చోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కంప్లీట్ ఎంటర్టైనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్స్కి ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది.
రవితేజ, శ్రీలీల డ్యాన్సులు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. రవితేజ ఎక్స్ట్రార్డినరీ పర్సన్. మల్టిపుల్ సినిమాలు చేస్తున్నప్పటికీ షెడ్యూల్ వారీగా చాలా కంఫర్ట్ బుల్గా పని చేశాం. ఆయనతో మరిన్ని ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాం. ఒక ఫ్యాక్టరీ మోడల్లో పని చేయాలనే ఉద్దేశంతోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీని మొదలుపెట్టాం. కంటిన్యూస్ సినిమాలు నిర్మిస్తాం. డిఫరెంట్ కంటెంట్తో మంచి లైనప్ ఉంది. ఓటీటీకి చాలా కంటెంట్ డెలివర్ చేస్తున్నాం. ఇప్పటికే మూడు ప్రాజెక్ట్స్ని ఓటీటీ వేదికగా విడుదల చేశాం. ప్రొడక్షన్ లో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి’ అని చెప్పారు.