తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్​కే అధికారం :  తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్​కే అధికారం :  తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్, వెలుగు: ఎవరెన్ని చెప్పినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ సనత్ నగర్ సెగ్మెంట్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్​పల్లిలోని తన ఇంటి వద్ద సనత్ నగర్ సెగ్మెంట్ పరిధిలోని క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ నాయకులతో వేర్వేరుగా ఆయన సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు.

డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, దళిత బంధు, బీసీ బంధు స్కీమ్ కింద ఎంతోమంది అర్హులు లబ్ధిపొందేలా చేశామన్నారు. సనత్​నగర్ సెగ్మెంట్​లో మూడోసారి భారీ మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని తెలిపారు. సెగ్మెంట్​లోని సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందన్నారు. సమావేశంలో మైనార్టీ నాయకులు ప్రశాంత్, జయరాజ్, సామెల్, దయాకర్, శాంసన్, ఫహీం, అఖిల్, ఆరీఫ్, మోహిన్, రజాక్, షఫీ తదితరులు పాల్గొన్నారు.