పల్లాకు టికెట్​ వద్దే వద్దు..ముత్తిరెడ్డికే ఇవ్వాలంటూ ఆడియో వైరల్​

పల్లాకు టికెట్​ వద్దే వద్దు..ముత్తిరెడ్డికే ఇవ్వాలంటూ ఆడియో వైరల్​

జనగామ, వెలుగు :  జనగామ ఎమ్మెల్యే టికెట్ పల్లా రాజేశ్వర్​రెడ్డికి ఇవ్వొద్దని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఇస్తే గెలిపించుకుంటామని ఓ ఆడియో సోషల్​మీడియాలో వైరల్​అవుతోంది. నర్మెట మండలంలో సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఈ మేరకు చర్చ జరిగినట్లు గులాబీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. పంద్రాగస్టు సందర్భంగా సరదాగా శ్రీశైలం టూర్​ వెళ్లేందుకు సమావేశం ఏర్పాటు చేసుకోగా అక్కడికి స్టేషన్​ఘన్​పూర్​కు చెందిన ఇద్దరు పల్లా అనుచరులు రాగా వారికి సర్పంచులు తేల్చి చెప్పినట్లు ఆడియోలో ఉంది. అంతకుముందు సదరు సర్పంచులు, లీడర్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్​రెడ్డి బర్త్​ డే వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత మరో చోట జరిగిన మీటింగ్​లోనూ జనగామ టికెట్​గురించే చర్చ జరిగింది. ‘పోచంపల్లికి టికెట్​ఇచ్చినా ఓకే.. లేదంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్​ఇచ్చినా గెలిపించుకుంటాం.. కానీ, పల్లా రాజేశ్వర్​ రెడ్డికి వద్దు’ అని అన్నట్లు ఉన్న ఆడియోను ముత్తిరెడ్డి అనుచరులు వైరల్​ చేస్తున్నారు.