విద్యుత్ ప్రమాదంలో చేతులు కోల్పోయిన బాలుడు.. ఆదుకోవాలని వినతి
రెండు చేతులు కోల్పోయి దివ్యాంగుడైన సమీర్
పరిగి, వెలుగు: ఈనెల 8న జరిగిన విద్యుత్ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా మరో బాలుడు రెండు చేతులు కోల్పోయి దివ్యాంగుడిగా మారాడు. నిరుపేద కుటంబానికి చెందిన మహ్మద్ రఫీ, -రేష్మ దంపతులది పరిగి మండలం మాదారం. రఫీ పరిగిలో ఫ్రూట్స్విక్రయిస్తుంటాడు. వీరికి నలుగురు సంతానం. సమీర్8న గాలిపటం ఎరగేస్తుండగా అది విద్యుత్వైర్లకు తగిలింది. దానిని తీస్తుండగా విద్యుదాఘాతానికి గురవడంతో సమీర్ రెండు చేతులు కోల్పోయాడు.
రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబం కావడంతో బాలుడికి వైద్యం చేయించలేకపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న శంకర్పల్లి మండలం బానూర్కు చెందిన చి విన్నర్స్ఫౌండేషన్ సభ్యులు రూ.18 వేల విలువ చేసే సరుకులు అందజేశారు. బాలుడి విద్య, వైద్యపరంగా ఆదుకుంటామని ఫౌండేషన్ అధ్యక్షుడు అరికపూడు రఘు, జీవరత్నం, మల్లేష్, ప్రభులింగం తెలిపారు.