రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ ఓఆర్ఆర్పై వెళ్తున్న కారు అకస్మాత్తుగా డివైడరును ఢీకొట్టింది. దాంతో కారులోని వారందరికి గాయాలయ్యాయి. శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళ్తున్న TS12EK 0298 స్విఫ్ట్ కారులో అయిదుగురు వ్యక్తులు ఉన్నారు. వీరంతా శుక్రవారం రాత్రి ఓఆర్ఆర్పై వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు మిగతావారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ప్రయాణీకుల సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని.. గాయపడినవారిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. కారులోని ప్రయాణికులంతా టోలిచౌకికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
For More News..