న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మూడు నెలలు లేదంటే కొత్త డైరెక్టర్ను నియమించే వరకు డాక్టర్ రణదీప్ గులేరియా ఎయిమ్స్ డైరెక్టర్గా కొనసాగనున్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
AIIMS Director Randeep Guleria's tenure extended by three months or by the time a new Director is appointed, whichever is earlier. pic.twitter.com/t4snLJivue
— ANI (@ANI) June 23, 2022
ఐదేళ్ల కాలానికి రణదీప్ గులేరియా 28 మార్చి 2017న ఎయిమ్స్ డైరెక్టర్గా నియామకమయ్యారు. గురువారం (జూన్ 23) నుంచి మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగించగా.. ఈ లోపు కొత్త డైరెక్టర్ను నియమించనున్నారు.