వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని అమడబాకుల గ్రామస్తుల ఆందోళన హింసాత్మకంగా మారింది. పులిగుట్టపై మైనింగ్ ఆపివేయాలంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఉదయం వేలాది మంది జనం పులిగుట్ట వద్దకు చేరుకుని ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మైనింగ్ పనులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను అడ్డుకుని జేసీబీ, టిప్పర్లను ధ్వంసం చేశారు. అధికారులు వచ్చి తమకు సమాధానం చెప్పే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. గ్రామస్తుల ఆందోళనకు జిల్లా బీజేపీ నాయకులు కొమ్ము భరత్ భూషణ్, బాల బాణెమ్మలు మద్దతు పలికారు. ఆందోళన కారుల్లో పలువురిని పోలీసులు అరెస్టు చేసి కొత్తకోట పోలీస్ స్టేషన్కు తరలించారు. పులిగుట్టపై మైనింగ్ వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జనం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయేంతవరకు పోరాటం చేస్తామని అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.
పులిగుట్టపై మైనింగ్ ఆపివేయాలని ఆందోళన.. జేసీబీ, టిప్పర్లు ధ్వంసం
- మహబూబ్ నగర్
- February 26, 2023
లేటెస్ట్
- గ్రాము బంగారంపై రూ.30 తగ్గింపు
- కల్వర్టును ఢీ కొట్టిన బస్సు..ఇద్దరు మృతి
- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత
- నేటి నుంచే నామినేషన్లు 25 వరకు స్వీకరణ
- ఇప్పుడు భారత్ జనాభా ఎంతో తెలుసా.. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రిపోర్ట్
- Maharshi Raghava: వందోసారి రక్తదానం చేసిన నటుడు మహర్షి.. మెగాస్టార్ ప్రత్యేక సన్మానం
- కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు నమోదు..
- పసుపు ధరలో ట్రేడర్ల కమీషన్.. రైతులకు తప్పని తిప్పలు
- కల్యాణ రామునికి 45కిలోల లడ్డు
- ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల చేతిలో పల్లి రైతులు విలవిల
Most Read News
- మాంసం ప్రియులకు షాక్... హైదరాబాద్ లో ఆదివారం మటన్ షాపులు బంద్
- మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
- IPL 2024: 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. RCB గెలుపుకు మంచి ఉపాయం చెప్పిన మాజీ క్రికెటర్
- AP SSC Results: పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..
- అంతరిక్షంలో భూమికి దగ్గరగా అతి పెద్ద బ్లాక్ హోల్: సూర్యుని కంటే 33 రెట్లు పెద్దది
- VenkyAnil3: వెంకీ సినిమాలో నటించాలనుకుంటున్నారా..ఇదిగో ఆర్టిస్టులు కోసం కాస్టింగ్ కాల్
- WhatsApp Update: వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ గమనించారా..
- నా కొడుక్కు ఏమైనా అయితే వెస్ట్ జోన్ డీసీపీదే బాధ్యత : షకీల్
- ఎర్రబెల్లికి అవమానం.. అందరి ముందు పరువు పోయిందిగా