హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ , బీజేపీలు కలిసిపోయాయని టీఆర్ ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్ రావు ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ముసుగు పొత్తు పెట్టు కున్నాయని, కరీంనగర్ , నిజామాబాద్లో సహకరిం చుకుంటు న్నాయని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడారు.
బీజేపీకి 700 వార్డుల్లో , కాంగ్రెస్ కు 400 వార్డుల్లో క్యాండిడేట్లే లేరని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు క్యాడర్ లేదని, బీజేపీకి అసలు ఓట్లే లేవన్నారు. టీఆర్ ఎస్ 84 వార్డులను ఏకగ్రీవంగా గెలుచుకుందని, పరకాల, చెన్నూర్ మున్సిపాలిటీలు తమ పార్టీ ఖాతాలో చేరాయన్నారు.