
ప్రభాస్ సినిమా ‘ఆదిపురుష్’లో సీతగా కనిపించిన కృతీసనన్.. వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. షాహిద్ కపూర్కు జంటగా ఆమె నటించిన ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ మూవీలో హ్యూమర్తో పాటు వీళ్లిద్దరి కెమిస్ట్రీ సినిమాకు హైలైట్గా నిలిచింది.
ఇదిలా ఉంటే కృతి సనన్ హీరోయిన్గా నటిస్తున్న మరో చిత్రం వచ్చే నెలలో రిలీజ్కు రెడీ అవుతోంది. కరీనా కపూర్ ఖాన్, టబు, కృతి లీడ్ రోల్స్లో నటించిన ‘ది క్రూ’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి రాజేష్ కృష్ణన్ దర్శకుడు. ఏక్తాకపూర్, రియాకపూర్ నిర్మిస్తున్నారు. మార్చి 29న సినిమాను విడుదల చేయబోతున్నట్టు ఇటీవల అనౌన్స్ చేశారు.
ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఎయిర్ హోస్టెస్లుగా నటిస్తున్నారు. మరోవైపు ‘దో పత్తి’ అనే చిత్రంలో నటిస్తుండడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తోంది కృతి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ వెబ్ మూవీ నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది కృతిసనన్.