హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పదేండ్ల పాలనలో పేదల సొంతింటి కల నెరవేరలేదని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేద ప్రజలు ఇండ్లు కొనేందుకు లేదా కట్టుకు నేందుకు హౌసింగ్ స్కీమ్ తీసుకువచ్చి బస్తీలు, అద్దె ఇండ్లలో ఉండేవారి సొంతింటి కలను నెరవేరుస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటిం చడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.
ఐదేండ్లలో దేశంలోని పేదలకు ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తామని 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందని, పదేండ్లయినా వాటి నిర్మాణం పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఐదేండ్లలో మరో 2 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల లబ్ధి కోసమే తప్ప పేద వారికి న్యాయం చేయాలన్న ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు.