5 లక్షల మందికి చేప ప్రసాదం ఇచ్చాం

5 లక్షల మందికి చేప ప్రసాదం ఇచ్చాం
  • బత్తిన హరినాథ్​ గౌడ్​ కుటుంబ సభ్యులు

పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 5 లక్షల మందికి చేప ప్రసాదం పంపిణీ చేశామని బత్తిన హరినాథ్​గౌడ్ కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌ను ఆయన ఇంట్లో బత్తిన సోదరులు కలిశారు. మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీని సక్సెస్​చేసినందుకు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.