- బత్తిన హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు
పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 5 లక్షల మందికి చేప ప్రసాదం పంపిణీ చేశామని బత్తిన హరినాథ్గౌడ్ కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆయన ఇంట్లో బత్తిన సోదరులు కలిశారు. మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీని సక్సెస్చేసినందుకు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.