కరోనా ట్రీట్ మెంట్ జిల్లాలోనూ ప్రైవేట్ కు

కరోనా ట్రీట్ మెంట్ జిల్లాలోనూ ప్రైవేట్ కు

హైదరాబాద్ లో మాదిరిగానే జిల్లాల్లోనూ కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రైవేటు హాస్పిటల్స్ కు  ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తోంది. ఇందుకోసం చాలా హాస్పిటల్స్ క్యూ కడుతున్నాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కొవిడ్ సెంటర్లలో ప్రభుత్వం సరైన సౌలతులు కల్పించకపోవడం, డాకర్లు, స్టాఫ్కొరతతో పేషెంట్లకు ట్రీట్మెంట్అందడం లేదు. పాత జిల్లా కేం ద్రాల్లో తప్ప ఎక్కడ కూడా సీరియస్ కేసులను తీసుకోవడం లేదు. ఇటీవల నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ హాస్పిటల్స్లో ఆక్సిజన్ అందక కొందరు, అర్థరాత్రి బెడ్లమీది నుంచి కింద పడి కొందరు కరోనా పేషెంట్లు చనిపోయారు.ఈక్రమంలోప్రభుత్వం జిల్లాల్లో నూ ప్రైవేట్హాస్పిటల్స్లో కరోనా ట్రీట్ మెంట్కు పర్మిషన్ ఇవ్వడం మొదలుపెట్టింది . గవర్నమెంట్హాస్పిటల్స్లో సౌలతులు కల్పించలేకనే ప్రభుత్వం ఇలా ప్రైవేటుకు పర్మిషన్లు ఇస్తోందన్న విమర్శలువస్తున్నాయి.కరోనా ట్రీట్మెంట్ అందించేందుకు దాదాపు అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ వార్డులను ఏర్పాటు చేసినట్లు, ఎమర్న్సీ జె సేవల కోసం ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటరను్ల కూడా అందుబాటులో ఉంచినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

కానీ చాలా హాస్పిటల్స్ లో వాటిని వాడకుండా పక్కన పడేశారు. వనపర్తి జిల్లాకొవిడ్ సెంటర్లోనైతే ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క పేషెంట్కూ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. అన్నిచోట్లా.. సీరి యస్గా ఉన్నవాళ్లను తప్ప మిగిలినవాళ్లందరినీ హోం ఐసోలేషన్కే పంపిస్తున్నారు. వరంగల్ ఎంజీఎంలో తప్ప మిగిలిన అన్ని హాస్పిటల్స్లోనూ పెద్దసంఖ్యలో బెడ్స్ఖాళీగా ఉంటున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాలో 7 కరోనా సెంటరలో ్ల 227 బెడ్లకుగాను155 ఖాళీగాఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు కొవిడ్ సెంటరలో ్ల 390 బెడ్లకుగాను170, ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలోని ఐదు కొవిడ్ సెంటర్లపరిధిలో 390 బెడ్లకుగాను 218, ఉమ్మడి జిల్లాలోని 7 ఐసోలేషన్‌‌సెంటర్లలో 205 బెడ్లకు గాను 85, ఉమ్మడి కరీంనగర్జిల్లాలోని 6 కొవిడ్ సెంటర్లపరిధిలో 426 బెడ్లకుగాను 208 ఖాళీగా ఉన్నాయి.

డాక్టర్లు, స్టాఫ్ కొరత

రాష్ట్రంలో ప్రస్తుం పీహెచ్సీల నుంచి టీచింగ్ హాస్పిటళ్లవరకు ప్రభుత్వం మంజూరు చేసిన డాక్టర్ పోస్టులు 7వేలు. అఫీషియల్ లెక్కల ప్రకారం 2,200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈహైదరాబాద్ గాంధీ తర్వాత వరంగల్లోని ఎంజీఎం, ఆదిలాబాద్లోని రిమ్స్, నిజామాబాద్లోని జీజీహెచ్ కీలకమైనవి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్.. ఇలా ఆదిలాబాద్‌‌ రిమ్స్‌‌లో 203 పోస్టులకు గాను 120 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్‌‌హాస్పిటల్‌‌లో 288 పోస్టులకుగాను114 పోస్టులు ఖాళీలే. ఎంజీఎంలో డాక్టర్లు, స్టాఫ్కలిపి 1470 పోస్టులకు గాను 644 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాఆసుపత్రుల్లోనూ ఇదే సీన్కనిపిస్తోంది. దీంతో ఇటీవల ఒక్కో ఉమ్మడి జిల్లా పరిధిలో 20 చొప్పున డాకర్ట్లను కాంట్రాక్ట్ ర్ పద్థతిలో తీసుకోవాలని నిర్ణయించి ఇంటర్వ్యూలకు పిలిస్తే కరీంనగర్, వరంగల్జిల్లాల్లో తప్ప మిగిలిన జిల్లాల్లో పెద్దగా రెస్పాన్స్రాలేదు. మిగిలిన స్టాఫ్దీ ఇదే పరిస్థితి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వదవాఖాన్లలో 30 వేల వరకు బెడ్స్ఉన్నట్లుఅధికారు లు చెప్తున్నారు. ఇన్నిబెడ్లనిర్వహణకు సుమారు 20 వేల మంది నర్సులు కావాలి. కానీ 4,473 మంది రెగ్యులర్ నర్సులు మాత్రమే పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో కొందరిని తీసుకుంటున్నా టైంకు జీతాలు రాక వారు తరచూ ఆందోళన చేస్తున్నారు.

బెడ్ల మీదేచనిపోతున్న పేషెంట్స్..

జులై 10న నిజామాబాద్లోని జీజీహెచ్లో నలుగురు, జులై 26, 27 వ తేదీల్లోకరీంనగర్ ఆసుపత్రిలో ఇద్దరు ఆక్సిజన్అందక చనిపోయారనే ఆరోపణలు వచ్చాయి. కరీంనగర్ హాస్పిటల్లోనైతే బెడ్లపై నుంచి కిందపడి ఊపిరి ఆడక మృతిచెందిన పేషెంట్లవీడియో క్లిపిం గ్స్ సోషల్ మీడియాలో చక్కర్ లుకొట్టాయి. జులై 15న సిద్దిపేట ఐసోలేషన్ వార్డును ప్రారంభించిన రోజే ఓ పేషెంట్సగం బెడ్ మీద, సగం బెడ్ కింద ఉ న్న స్థితిలో మృతిచెంది కనిపించాడు. తాజాగా వరంగల్లో బెడ్లమీద చనిపోయి గంటల కొద్దీ తీయకుండా ఉన్న డెడ్ బాడీస్ ఫొటోలు బయటకు వచ్చాయి. ఇలాంటి ఘటనలు కరోనా ట్రీట్మెంట్ విషయంలో సర్కారును ఇరకాటంలోకి నెట్టాయి.

సర్కార్ దవాఖాన్లలో చేయలేక..ప్రైవేటుకు

మొదట్లో ప్రైవేట్ దవాఖానల్లో కరోనా ట్రీట్మెంట్ కు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం చెప్పింది.కానీ.. తొలిదశలో హైదరాబాద్లోని ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్కు పర్మిషన్ఇచ్చింది. ఇప్పుడు జిల్లాల్లో నూ ప్రైవేట్ హాస్పిటల్స్నుంచి అప్లికేషన్లు తీసుకుంటోంది. ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లాలో ఏడు ప్రైవేట్ హాస్పిటల్స్లో కరోనా ట్రీట్మెంట్ కు పర్మిషన్ ఇచ్చారు. మరో ఐదు హాస్పిటల్స్ నుంచి అప్లి కేషన్స్తీ సుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడు ప్రైవేట్ హాస్పిటల్స్కు పర్మిషన్ ఇవ్వగా, సోమవారం వరకు మరో 15 హాస్పిటల్స్ నుంచి అప్లికేషన్లుఅందాయి. నిజామాబాద్జిల్లాలో నాలుగు హాస్పిటల్స్కు ఆల్రెడీ అనుమతి ఇవ్వగా, మరో 4 అప్లికేషన్లువచ్చాయి. ఉమ్మడి ఖమ్మంలో ఒ క ప్రై వేట్ హాస్పిటల్ కు ఇప్పటికే పర్మిషన్ ఇవ్వగా, మరో మూడు ఆస్పత్రుల నుంచి అప్లికేషన్లు అందాయి. ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో12 హాస్పిటల్స్నుంచి ఉమ్మడి నల్గొం డ జిల్లాలో నాలుగు ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి అప్లికేషన్లు వచ్చాయి.