
హైదరాబాద్: కరోన కష్టకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రజలకు అవుతున్న ఖర్చు ప్రభుత్వం భరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో తెలిపారు. ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు తీసుకున్న విధంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో సరైన మౌలిక సదుపాయాలు లేవని..కోవిడ్ కష్ట కాలంలో గత్యంతరం లేక జనం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ జనాలను జలగల్లా పీడిస్తున్నాయని తెలిపారు.