
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గొర్రెలు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని సమాజ్ వాది పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి అన్నారు. 12 లక్షల కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నాయని, పెద్ద ఎత్తున మాంసం సప్లై చేస్తున్న వీరి గురించి ప్రభుత్వం ఆలోచించకపోవడం బాధాకరమన్నారు. చిక్కడపల్లిలో శుక్రవారం ఆయన మాట్లాడారు. జీవాలకు వచ్చే వ్యాధుల వల్ల కాపర్లు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారన్నారు. మామిడిపల్లిలో గొర్రెల కాపర్ల కోసం రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.