జై బోలో హనుమాన్​కీ..కొండగట్టులో భక్తుల రద్దీ 

జై బోలో హనుమాన్​కీ..కొండగట్టులో భక్తుల రద్దీ 

జై బోలో హనుమాన్​కీ..కొండగట్టులో భక్తుల రద్దీ 
ఇంకా తరలివస్తున్న స్వాములు 

కొండగట్టులో మంగళవారం హనుమాన్​చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది హనుమాన్​ స్వాములు తరలిరావడంతో గుట్ట ప్రాంతం కిక్కిరిసింది. రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్​కీ నినాదాలతో పరిసరాలు మారుమోగాయి. సుమారు 30వేల మంది భక్తులు అంజన్నను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మాలవిరమణ అనంతరం హనుమాన్ ​దీక్షాపరులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​, అడిషనల్​ కలెక్టర్​ మంద మకరంద్​పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఇది ఇలా ఉంటే సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఏర్పాట్లను ఈవో వెంకటేశ్, ఏఈవో బుద్ది శ్రీనివాస్ తదితరులు పర్యవేక్షిచారు.

– కొండగట్టు,వెలుగు