ఫాంహౌస్ కేసు : సిట్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఫాంహౌస్ కేసు : సిట్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఫాంహౌజ్ కేసులో గతంలో సిట్ వేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. బీఎల్ సంతోష్, తుషార్ జగ్గుస్వామిని నిందితులుగా చేర్చాలన్న సిట్ మెమోపై ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. ముగ్గుర్ని నిందితులుగా చేరుస్తూ సిట్ గతంలో మెమో జారీ చేసింది. దీనిపై ముగ్గురు మొదట ఏసీబీ కోర్టుకు వెళ్లారు. 

అప్పుడు ఏసీబీ కోర్టు ఈ ముగ్గుర్ని నిందితులుగా చేర్చలేమని ఆ నిర్ణయాన్ని కొట్టి వేసింది. కేవలం మెమో ఆధారంగా వ్యక్తులను నిందితుల లిస్టులో చేర్చలేమని అప్పట్లో ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది. అయితే ఆ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లింది సిట్. కాగా ఇవాళ సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది.