గో మహాగర్జన సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

గో మహాగర్జన సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఎన్టీఆర్ స్టేడియంలో ఏప్రిల్ 1న జరగనున్న గో మహాగర్జన సభకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. సినిమాలకు, పర్మిషన్ ఇచ్చినప్పుడు అంత పెద్ద గ్రౌండ్ లో సభ జరుపుకోవడానికి అభ్యంతరాలు ఏంటని ప్రశ్నించింది కోర్టు. 400 మందితో సభ నిర్వహించుకోవచ్చని సూచించింది. కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని యుగతులసి ఫౌండేషన్ కు సూచించింది. సభకు అనుమతి కోరుతూ హై కోర్టును ఆశ్రయించింది యుగతులసి ఫౌండేషన్.